Share News

CM Revanth Reddy: ఆందోళన వద్దు.. ఏకాగ్రతతో పరీక్షలు రాయండి

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:37 AM

రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

CM Revanth Reddy: ఆందోళన వద్దు.. ఏకాగ్రతతో పరీక్షలు రాయండి

  • గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఆందోళన చెందకుండా.. ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు.


ఈ పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 03:37 AM