Share News

Konda Surekha: మంత్రి సురేఖ ఫొటో మార్ఫింగ్‌ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Oct 16 , 2024 | 03:18 AM

మంత్రి కొండా సురేఖ ఫొటోను మార్ఫింగ్‌ కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.

Konda Surekha: మంత్రి సురేఖ ఫొటో మార్ఫింగ్‌ కేసులో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ ఫొటోను మార్ఫింగ్‌ కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. మంత్రికి మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఓ కార్యక్రమంలో నూలు దండ వేస్తున్న ఫొటోను ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేసి తప్పుడు ప్రచారం చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎంపీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిజామాబాద్‌కు చెందిన దేవన్న, జగిత్యాలకు చెందిన మహే్‌షను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.

Updated Date - Oct 16 , 2024 | 03:18 AM