Share News

Harish Rao: కన్నీరు పెట్టుకున్న హరీశ్ రావు.. ఇంతకీ ఏమైందంటే..

ABN , Publish Date - Sep 28 , 2024 | 01:28 PM

హైడ్రా ఉక్కుపాదం మోపడంతో.. పలు కాలనీల వాసులు బాధితులుగా మారారు. దీంతో తమ గోడు వినిపించేందుకు ప్రభుత్వంలో ఒక్కరు లేక పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ బాధలు వినిపించేందుకు వారంతా శనివారం ఉదయం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు హరీశ్ రావుతోపాటు సబితా ఇంద్రారెడ్డితో వారు సమస్యలు చెప్పుకున్నారు.

Harish Rao: కన్నీరు పెట్టుకున్న హరీశ్ రావు.. ఇంతకీ ఏమైందంటే..

హైదరాబాద్, సెప్టెంబర్ 28: హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. నగర వ్యాప్తంగా వేలాది ఇళ్లను ఇప్పటికే నేలమట్టం చేసింది. దీంతో లక్షలాది మంది బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను కలిసి.. తమ గోడు చెప్పుకునేందుకు వారంతా శనివారం ఉదయం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

Also Read: Bhavika Mangalanandan: పాకిస్థాన్ సంగతి ప్రపంచానికి తెలుసు


ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీశ్‌రావుతోపాటు సబితా ఇంద్రారెడ్డికి వారు.. తమ గోడు వినిపించారు. ఈ సందర్బంగా వారి ఆవేదన విన్న హరీశ్‌రావు కాస్తా ఎమోషనల్ అయ్యారు. బీఆర్ఎస లీగల్ సెల్ మీకు అండగా నిలుస్తుందని ఈ సందర్బంగా బాధితులకు వారు హామీ ఇచ్చారు.

Also Read: Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం


మరోవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హైడ్రా తమ ఇళ్లను సైతం కూల్చివేస్తారనే భయంతో కూకట్‌పల్లిలోని నల్ల చెరువుకు చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. తమ ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుందని భయంతో సదరు మహిళ బలవన్మరణానికి పాల్పడింది.

Also Read: Mumbai: నగరానికి పొంచి ఉన్న ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు


గతవారం నల్ల చెరువులో నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా 20 ఇళ్లకు ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ ఘటనపై హైడ్రా చీఫ్ ఎవి రంగనాథ్ స్పందించారు. బుచ్చమ్మ మరణానికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం ఇచ్చారు.

Also Read: PM Modi: నేడు జమ్మూకు ప్రధాని మోదీ


రాష్ట్రంలో చెరువులు, నాలాలు ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను గుర్తించి కూల్చి వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ.వి.రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. దీంతో నగరంతోపాటు నగర శివారు ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది.

Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన


దీంతో వేలాది ఇళ్లను కూల్చివేశారు. ఆ సమయంలో హైడ్రా అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయినా వీటిని ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా హైడ్రా తన పని తాను చేసుకు పోతుంది. దీంతో బాధితులంతా బీఆర్ఎస్ భవన్‌కు క్యూ కడుతున్నారు. అందులోభాగంగా ఈ రోజు కేటీఆర్, హరీశ్‌రావులను కలిసేందుకు వారంతా బీఆర్ఎస్ భవన్‌కు చేరుకున్నారు.

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు

For National News And Telugu News..

Updated Date - Sep 28 , 2024 | 01:37 PM