Share News

Gachibowli: చికెన్‌ బిర్యానీలో కప్ప!

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:42 AM

హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలోని కదంబమె్‌సలో విద్యార్థులకు వడ్డించిన బిర్యానీలో కప్ప దర్శనమిచ్చింది.

Gachibowli: చికెన్‌ బిర్యానీలో కప్ప!

  • గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ మెస్‌లో ఘటన

రాయదుర్గం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలోని కదంబమె్‌సలో విద్యార్థులకు వడ్డించిన బిర్యానీలో కప్ప దర్శనమిచ్చింది. ఈనెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంమనోహర్‌ అనే విద్యార్థి క్యాంప్‌సలోని మెస్‌లో బిర్యానీ తింటుండగా చికెన్‌తో పాటు చనిపోయిన కప్ప కనిపించడంతో అందరూ నివ్వెరపోయారు.


వెంటనే క్యాంపస్‌, ఫుడ్‌సెఫ్టీ అధికారులకు ఎక్స్‌ వేదికగా ఫిర్యాదు చేశారు. మెస్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పటివరకు సిబ్బందిపై ఏ చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థుల మండిపడుతున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 04:42 AM