Share News

Flood Relief: జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.2.5 కోట్ల విరాళం

ABN , Publish Date - Sep 07 , 2024 | 04:24 AM

వరద బాధితులను ఆదుకునేందుకు జీఎంఆర్‌ గ్రూపు రూ.2.5కోట్ల విరాళం ఇచ్చింది.

Flood Relief: జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.2.5 కోట్ల విరాళం

  • సీఎంకు చెక్కు అందించిన ప్రతినిధులు

శంషాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): వరద బాధితులను ఆదుకునేందుకు జీఎంఆర్‌ గ్రూపు రూ.2.5కోట్ల విరాళం ఇచ్చింది. వరద బాధితులకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆర్థిక సాయం చేశామని జీఎంఆర్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రూ. 2.5 కోట్ల చెక్కును శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. జీఎంఆర్‌ సహాయం చేయడం అభినందనీయమని సీఎం పేర్కొన్నట్ల్లు జీఎంఆర్‌ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 04:24 AM