Share News

Ramoji Rao: రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:02 PM

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి కూడా సంతాపం ప్రకటించారు.

 Ramoji Rao: రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

హైదరాబాద్, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి కూడా సంతాపం ప్రకటించారు.

CBN-6.jpg


రామోజీ ఫిలిం సిటీకి కాసేపటి క్రితమే వారిద్దరూ చేరుకుని అక్కడ ఉన్న రామోజీ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. పార్థీవ దేహాన్ని చూసి చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని అన్నారు. మీడియా, చలనచిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి పేర్కొన్నారు.

NCBN.jpg


రామోజీరావు వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2024 | 06:56 PM