Share News

MMTS: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఎందుకంటే?

ABN , Publish Date - Jul 20 , 2024 | 02:31 PM

సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో కొన్ని MMTS సర్వీసులను రద్దు చేసింది.

MMTS: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఎందుకంటే?

హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో కొన్ని MMTS సర్వీసులను రద్దు చేసింది.

రద్దు చేయబడిన MMTS రైళ్లలో .47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా), 47156 (ఫలక్‌నుమా - సికింద్రాబాద్), 47185 (సికింద్రాబాద్ - ఫలక్‌నుమా), 47252 (ఫలక్‌నుమా - సికింద్రాబాద్), 47243 (సికింద్రాబాద్ - మేడ్చల్), 47241 (మేడ్చల్) , 47250 (సికింద్రాబాద్ – ఫలక్ నుమా), 47201 (ఫలక్ నుమా – హైదరాబాద్), 47119 (హైదరాబాద్ – లింగంపల్లి), 47217 (లింగంపల్లి – ఫలక్ నుమా),47218 ( ఫలక్‌నుమా - రామచంద్రపురం)రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.


ఈ నేప‌థ్యంలో ప్రయాణికులు అప్రమత్తమై, ఇత‌ర ర‌వాణా మార్గాల‌ను ఎంచుకోవాల‌ని అధికారులు సూచించారు. సోమ‌వారం నుంచి య‌థావిధిగా రైళ్లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.

Updated Date - Jul 20 , 2024 | 02:35 PM