Share News

Ramoji Rao: ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:25 PM

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.

Ramoji Rao: ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు

హైదరాబాద్, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.


అయితే రామోజీ అంత్యక్రియలు రేపు(ఆదివారం) ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఫిలింసిటీలో జరుగనున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపనున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలను సీఎస్ శాంతికుమారి జారీ చేశారు. ఫిలింసిటీకి పలువురు ప్రముఖులు వచ్చి సంతాపం ప్రకటిస్తున్నారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని కంటతడి పెట్టారు.


రామోజీరావు వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2024 | 06:01 PM