Share News

Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు..

ABN , Publish Date - Sep 20 , 2024 | 08:40 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. హైడ్రాకు చట్టబద్దత కల్పించేలా ఆర్డినెన్సుకు మంత్రివర్గం ఆమోదించనుంది.

Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం  నేడు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ (Cabinet Meeting) అవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. హైడ్రాకు (Hydra) చట్టబద్దత కల్పించేలా ఆర్డినెన్సుకు మంత్రివర్గం ఆమోదించనుంది. ధరణి కమిటీ చేసిన 54 సిఫారసులపైనా చర్చించి, అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.


బీసీ కుల గణన పై చర్చ

అలాగే బీసీ కుల గణనపై చర్చ జరగనున్నట్లు సమాచారం. పలు విశ్వవిద్యాలయాలకు కొత్త పేరు పెట్టడంపై కూడా కేబినెట్ చర్చించనున్నట్లు తెలియవచ్చింది. హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నారు. పోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయించారు. ఈ మూడింటికీ మంత్రి వర్గం ఆమోదముద్ర చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న 225 గ్రామ పంచాయ తీలు, ఔటర్ రింగు రోడ్డులోపల ఉన్న మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనంపైనా కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం.


‘హైడ్రా’కు చట్టబద్ధత కల్పించేలా ఆర్డినెన్స్‌ మొదలు.. ధరణి కమిటీ సిఫారసులు, రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌-2024 ముసాయిదా, రెండు యూనివర్సిటీలకు, ఒక సంస్థకు కొత్త పేర్లు పెట్టడం, వరద సహాయక చర్యలు, రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, బీసీ కుల గణన, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎజెండా భారీగా ఉన్న నేపథ్యంలో భేటీ సుదీర్ఘంగా కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. వరదలు, హైడ్రా ఆర్డినెన్స్‌, బీసీ కుల గణన వంటివాటిపై కూలంకషంగా చర్చించాల్సి ఉంటుందని గుర్తుచేస్తున్నారు.


హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ.. ఫోర్త్‌సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయించింది. ఈ మూడింటికీ శుక్రవారం ఆమోదముద్ర పడనుంది. ఇటీవలి వరదల వల్ల దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా పంట, ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది. కేంద్ర ప్రభుత్వానికి వివరాలను సమర్పించింది. దీనిపైనా మంత్రివర్గం చర్చించనుంది. హైడ్రాకు విశేషాధికారాలు కల్పించేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. తదుపరి జరిగే అసెంబ్లీలో హైడ్రా చట్టాన్ని తీసుకురానుంది. ఇటీవల ధరణి కమిటీ చేసిన 54 సిఫారసులపైనా చర్చించి, అమలుపై నిర్ణయం తీసుకోనుంది.


రాష్ట్రంలో బీసీ కుల గుణన చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే..! ఇది పూర్తయితే తప్ప.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, పాలక వర్గాలను ఏర్పాటు చేస్తేనే... కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తాయి. ఈ దృష్ట్యా పంచాయతీ ఎన్నికలకు ప్రతిబంధకంగా ఉన్న బీసీ కుల గణనను చేపట్టే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న 225 గ్రామ పంచాయతీలు, ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉన్న మునిసిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనంపైనా మంత్రివర్గం చర్చించనుంది. రైతు రుణ మాఫీ కింద మిగతా రుణాలను మాఫీ చేయడం, రైతు భరోసా విధివిధానాలు, ‘రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌-2024’ ముసాయిదా అంశం కూడా చర్చకు రానున్నాయి.

Updated Date - Sep 20 , 2024 | 08:41 AM