Share News

Hyderabad: రామోజీ కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

ABN , Publish Date - Jun 12 , 2024 | 05:08 AM

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబసభ్యులను మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు మరణించిన సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం సీడబ్ల్యూసీ, పార్టీ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పార్థివ దేహాన్ని చూసేందుకుగానీ, అంత్యక్రియలకు గానీ హాజరు కాలేకపోయారు.

Hyderabad: రామోజీ కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబసభ్యులను మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు మరణించిన సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం సీడబ్ల్యూసీ, పార్టీ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పార్థివ దేహాన్ని చూసేందుకుగానీ, అంత్యక్రియలకు గానీ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్‌ ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. రామోజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, ఇటీవల ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన తీన్మార్‌ మల్లన్న మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు.

Updated Date - Jun 12 , 2024 | 05:08 AM