Share News

Jupally Krishna Rao: సంప్రదాయం, ఆధునికతల కలబోత తెలంగాణ

ABN , Publish Date - Oct 09 , 2024 | 03:39 AM

సంప్రదాయం, ఆధునికతల కలబోత తెలంగాణ అని మంత్రి జూపల్లి కృష్ఱారావు అన్నారు. తెలంగాణను పర్యాటకుల, ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా చేయాలనే లక్ష్యంతో

Jupally Krishna Rao: సంప్రదాయం, ఆధునికతల కలబోత తెలంగాణ

  • రాష్ట్రానికి కొత్త పర్యాటక పాలసీని రూపొందిస్తున్నాం

  • లాస్‌ ఏంజిలి్‌సలో మంత్రి జూపల్లి కృష్ణారావు

సంప్రదాయం, ఆధునికతల కలబోత తెలంగాణ అని మంత్రి జూపల్లి కృష్ఱారావు అన్నారు. తెలంగాణను పర్యాటకుల, ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా చేయాలనే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం లాస్‌ఏంజిలి్‌సలోని డబుల్‌ ట్రీ హోటల్‌లో నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, విదేశీ ప్రతినిధులు, పర్యాటకులు, అక్కడి అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అంతర్జాతీయ పర్యాటకులకు మంత్రి జూపల్లి ఆహ్వానం పలికారు. పర్యాటకంతో పాటు తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో అంతర్జాయతీయ ప్రమాణాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నామని జూపల్లి వెల్లడించారు.

Updated Date - Oct 09 , 2024 | 03:39 AM