Share News

Ramoji Rao: రామోజీరావు నా రోల్ మోడల్: ఎమ్మెస్ కే ప్రసాద్

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:45 PM

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. అయితే ఆయన మృతిపై భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్ కే ప్రసాద్ (MS K Prasad) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.

Ramoji Rao: రామోజీరావు నా రోల్ మోడల్: ఎమ్మెస్ కే ప్రసాద్

విశాఖపట్నం, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. అయితే ఆయన మృతిపై భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్ కే ప్రసాద్ (MS K Prasad) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. రామోజీరావు మరణవార్త విని చాలా బాధపడ్డానని చెప్పారు. రామోజీ తన జీవితాన్ని ఎంత ప్రభావితం చేశారన్నారు. ఈమేరకు ఆయన ఫోన్‌లో ఏబీఎన్‌తో మాట్లాడారు.


తాను ఆయన అద్భుతమైన పని విధానాన్ని, నాయకత్వాన్ని చూశానని చెప్పారు. అతను తన రోల్ మోడల్‌లలో ఒకరని తెలిపారు. ఆయన అంకితభావం, ధృక్పథం, రచనలు తనపై చెరగని ముద్ర వేశాయన్నారు. రామోజీరావు అందించిన స్ఫూర్తికి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిననని ఎమ్మెస్ కే ప్రసాద్ పేర్కొన్నారు.


రామోజీరావు వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2024 | 06:54 PM