Share News

Nizamabad: బీరు బాటిల్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు..

ABN , Publish Date - Jul 03 , 2024 | 11:01 AM

నిజామాబాద్‌ జిల్లా మెండోర మండల కేంద్రానికి చెందిన తక్కల సాయిరెడ్డి(Takkala Sai Reddy) మంగళవారం స్థానికంగా ఉన్న వైన్స్‌లో కొనుగోలు చేసిన బీరు సీసాలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనిపించాయి.

Nizamabad: బీరు బాటిల్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు..

- వైన్స్‌ నిర్వాహకులతో వాగ్వాదం

మెండోర రూరల్‌(నిజామాబాద్‌): నిజామాబాద్‌ జిల్లా మెండోర మండల కేంద్రానికి చెందిన తక్కల సాయిరెడ్డి(Takkala Sai Reddy) మంగళవారం స్థానికంగా ఉన్న వైన్స్‌లో కొనుగోలు చేసిన బీరు సీసాలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనిపించాయి. దీంతో వైన్స్‌ నిర్వాహకుడిని నిలదీశాడు. ఆ బీరు బాటిల్‌ ఇస్తే మరొకటి ఇస్తానని సిబ్బంది చెప్పడంతో.. ఇలా ఎంత మందిని మోసం చేస్తారని సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇదికూడా చదవండి: MLA: బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి..


ప్లాస్టిక్‌(Plastic) వ్యర్థాలను గమనించకుండా బీరును తాగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా.. ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సాయిరెడ్డి డిమాండ్‌ చేశాడు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 11:01 AM