Share News

Kaleswaram: సరస్వతీ బ్యారేజీకి మరమ్మతులు.. గ్రౌంటింగ్ పనులు ముమ్మరం..

ABN , Publish Date - Jan 14 , 2024 | 09:39 PM

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతీ బ్యారేజీకి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఐదో బ్లాక్ లోని 28,38 పియర్ల వద్ద పడిన

Kaleswaram: సరస్వతీ బ్యారేజీకి మరమ్మతులు.. గ్రౌంటింగ్ పనులు ముమ్మరం..

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతీ బ్యారేజీకి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఐదో బ్లాక్ లోని 28,38 పియర్ల వద్ద పడిన సీపేజీలను గుర్తించి అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. రీజైన్ ప్రక్రియ ధ్వారా గ్రౌంటింగ్ పనులు చేపడుతున్నారు. మొదట సీపీజీ వద్ద ఇసుక బస్తాలతో రింగ్ బండ్ ఏర్పాటు చేసి.. ఆ తర్వాత పాలి యూరేహియన్ తో గ్రౌంటింగ్ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 38 పియర్ వద్ద పనులు కొనసాగుతున్నాయి.

కాగా.. గతేడాది అక్టోబరు లో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో పియర్స్‌ కుంగింది. ఆ సమయంలోనే అన్నారంలో బ్యారేజీ దిగువన బుంగలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం డిసెంబరులో అన్నారం సందర్శించింది. మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించించారు.

Updated Date - Jan 14 , 2024 | 09:40 PM