Share News

Hyderabad: గెలవడం చేతకాక ఉద్దెర మాటలు: రఘునందన్‌

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:00 AM

సొంత జిల్లాలో, తాను ఇన్‌చార్జిగా ఉన్న చేవెళ్ల, తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలిపించుకోని చేతకాని వ్యక్తి ఉద్దెర మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Hyderabad: గెలవడం చేతకాక ఉద్దెర మాటలు: రఘునందన్‌

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): సొంత జిల్లాలో, తాను ఇన్‌చార్జిగా ఉన్న చేవెళ్ల, తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలిపించుకోని చేతకాని వ్యక్తి ఉద్దెర మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నోట్ల కట్టలతో దొరికిన దొంగకు బీజేపీని విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి ఎలా పడతాయని ప్రశ్నించారు. ఒకే విమానంలో హరీశ్‌రావు, రేవంత్‌ రెడ్డి ప్రయాణం చేశారని, దీనిపై ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పడంలేదని నిలదీశారు. రేవంతే బీఆర్‌ఎస్‌ నాయకులతో ములాఖత్‌ అయ్యారని ఆరోపించారు. తనను విమర్శించే ముందు నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

Updated Date - Jun 06 , 2024 | 05:00 AM