Share News

Road Accident: వేగంగా దూసుకెళుతున్న నిస్సాన్ కారు.. ఒక్కసారిగా ప్రమాదం.. ఆపై ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 15 , 2024 | 08:55 AM

దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్ మహేంద్ర యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఈ ప్రమాదంలో మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నలుగురు విద్యార్థులు కలిసి నిస్సాన్ కారులో వెళుతూ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఢీకొట్టారు.

Road Accident: వేగంగా దూసుకెళుతున్న నిస్సాన్ కారు.. ఒక్కసారిగా ప్రమాదం.. ఆపై ఏం జరిగిందంటే..

హైదరాబాద్: దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. టెక్ మహేంద్ర యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఈ ప్రమాదంలో మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నలుగురు విద్యార్థులు కలిసి నిస్సాన్ కారులో వెళుతూ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఢీకొట్టారు. మృతి చెందిన యువకుడు వరంగల్‌కి చెందిన అన్నమనేని మేఘాంశ్‌గా గుర్తించడం జరిగింది. మేఘాంశ్ టెక్ మహేంద్ర యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన సాయి మానస్, శ్రీ చరణ్ రెడ్డి, అర్నవ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Chattisgarh: బీజాపూర్ ఎన్‌కౌంటర్లకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చి మావోయిస్ట్ పార్టీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 15 , 2024 | 08:55 AM