Share News

TS News: తెలంగాణ భవన్ వద్ద ప్రమాదం.. కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన ఎంపీ కేశవరావు కారు

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:40 PM

బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’ వద్ద ప్రమాదం జరిగింది. ఎంపీ కే.కేశవ రావు కారు ఓ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లింది. భూపాలపల్లి నియోజకవర్గం చల్పూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కాలుపై నుంచి వెళ్లడంతో అతడు గాయపడ్డాడు.

TS News: తెలంగాణ భవన్ వద్ద ప్రమాదం.. కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన ఎంపీ కేశవరావు కారు

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’ వద్ద ప్రమాదం జరిగింది. ఎంపీ కే.కేశవ రావు కారు ఓ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లింది. భూపాలపల్లి నియోజకవర్గం చల్పూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కాలుపై నుంచి వెళ్లడంతో అతడు గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై బాధితుడు శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఎంపీ కేశవరావు వెంటనే స్పందించారు. కారు దిగి వచ్చి పరామర్శించారు. శ్రీనివాస్ రెడ్డిని చికిత్స కోసం తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి బాధ్యుడైన కారు డ్రైవర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 10 , 2024 | 03:40 PM