Home » Telangana Bhavan
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటారా.. రేవంత్ రెడ్డి.. మీకు సంస్కారం ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతున్నదని, కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి.. మాట సమర్థించుకుంటున్నారని, కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
KTR: ముఖ్యమంత్రి రేవంత్పై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన భావదారిద్ర్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారని మండిపడ్డారు.
KCR: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చిన సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
Harish rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. దావోస్ దారి ఖర్చులకు నగదు వృధా చేశారాంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరిస్తారు. తర్వాత తనను ఏసీబీ అధికారులు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. గురువారం ఆయన ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని, పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు.
దీక్షా దివస్ వేళ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేకి బుద్దితో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పాలనలో తెలంగాణ భవన్ .. ప్రజలు జనతా గ్యారేజీగా మారిందని ఆయన అభివర్ణించారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి.. పేదలకు కనీస వసతులు కల్పించడమా... లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేయడమా.. అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబీ హటావో అంటారు కానీ గరీబోంకో హటావో అంటున్నారని మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
Telangana: హైడ్రాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు తెలంగాణ భవన్కు వచ్చారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామని హైడ్రా బాధితులు చెబుతున్నారు.