Share News

Surayapet: మద్యానికై బానిసై వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:39 AM

మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులను వేధిస్తున్న కుమారుడిని కన్నతండ్రే హతమార్చాడు.

Surayapet: మద్యానికై బానిసై వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి

  • సూర్యాపేట జిల్లాలో ఘటన

సూర్యాపేటరూరల్‌, సెప్టెంబరు 13: మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులను వేధిస్తున్న కుమారుడిని కన్నతండ్రే హతమార్చాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎ్‌స)లో జరిగింది. మండలంలోని బాపూజీతండాకు చెందిన బాణోతు పంతులుకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు కిరణ్‌ ఇటీవల మద్యానికి బానిసై మద్యం మత్తులో కుటుంబసభ్యులు, గ్రామస్థులతో తరుచూ గొడవ పడుతున్నాడు.


ఇంటి నుంచి వెళ్లిపోవాలని తండ్రిని పలుమార్లు కర్రతో కొడుతూ హింసిస్తున్నాడు. ఈక్రమంలో... ఈ నెల 11వ తేది రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో తండ్రి కోడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. కిరణ్‌ తన తండ్రిని కొట్టడం మొదలుపెట్టాడు. కొడుకు ప్రవర్తనకు విసుగెత్తిపోయిన పంతులు అక్కడే ఉన్న గొడ్డలితో కిరణ్‌ తలపై వేటు వేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కిరణ్‌ భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు.

Updated Date - Sep 14 , 2024 | 04:39 AM