Share News

Kodandaram: కేసీఆర్‌ ఒక్కడి వల్లనే తెలంగాణ రాలేదు

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:45 AM

కేసీఆర్‌ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

Kodandaram: కేసీఆర్‌ ఒక్కడి వల్లనే తెలంగాణ రాలేదు

  • అందరూ ఉద్యమిస్తేనే సాధ్యమైంది: కోదండరాం

నిజామాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేసీఆర్‌ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ఉద్యమించారని, ఎన్నో సంఘాలు పని చేశాయని అన్నా రు. ఎంతో మంది బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.


బీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ తన స్వలాభం కోసమే ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని, బీఆర్‌ఎస్‌ హయాంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని, అరెస్టులు చేసి నిరుద్యోగులపై నిర్బంధాలను అమలు చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు తమ స్వార్థం కోసం ప్రస్తుతం గ్రూప్‌-1 అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ నేతలు వాడుకుంటున్నారని విమర్శించారు.

Updated Date - Oct 21 , 2024 | 04:45 AM