Share News

Khammam: మా వాళ్లే రక్షించారు..

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:11 AM

ఖమ్మంలోని కరుణగిరి సాయికృష్ణనగర్‌లో మున్నేరు వరదలో ఓ భవనంపై పిల్లలతో సహా చిక్కుకున్న పది మంది సురక్షితంగా బయటపడ్డారు.

Khammam: మా వాళ్లే రక్షించారు..

  • ఖమ్మంలో వరద బాధిత కుటుంబం సురక్షితం

ఖమ్మం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మంలోని కరుణగిరి సాయికృష్ణనగర్‌లో మున్నేరు వరదలో ఓ భవనంపై పిల్లలతో సహా చిక్కుకున్న పది మంది సురక్షితంగా బయటపడ్డారు. తమని కాపాడాలని వేడుకుంటూ బాధితుల్లోని ఆకుల రాణి అనే మహిళ ఆదివారం ఉదయం సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో వైరలైంది.


అయితే, వారిని రక్షించేందుకు అధికారులు ఎవరూ స్పందించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భవనంపైనే ఉన్న తమను తమ బంధువులే రక్షించారని ఆకుల రాణి చెప్పారు. వైరాకు చెందిన తమ బంధువులు ఇద్దరు గజఈతగాళ్లను తీసుకొచ్చి తమని కాపాడారని, తామంతా ప్రస్తుతం ఖమ్మంలోని తమ బంధువుల ఇంటివద్ద సురక్షితంగా ఉన్నామని ఆమె తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 03:11 AM