Share News

Siddipet: వేద విద్వన్మణి త్రిగుళ్ల ప్రభాకర శర్మ కన్నుమూత

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:26 AM

సిద్దిపేట జిల్లా త్రిగుళ్ల గ్రామానికి చెందిన వేద విద్వన్మణి, బ్రహ్మశ్రీ త్రిగుళ్ల ప్రభాకర శర్మ (84) కన్నుమూశారు.

Siddipet: వేద విద్వన్మణి త్రిగుళ్ల ప్రభాకర శర్మ కన్నుమూత

హైదరాబాద్‌, అక్టోబరు 16: సిద్దిపేట జిల్లా త్రిగుళ్ల గ్రామానికి చెందిన వేద విద్వన్మణి, బ్రహ్మశ్రీ త్రిగుళ్ల ప్రభాకర శర్మ (84) కన్నుమూశారు. గుండె సంబంధ వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో వందలాది విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రభాకర శర్మ.. సనాతన వైదిక కార్యక్రమాల్లోనూ నిష్ణాతులు. తండ్రి రాజమౌళి శర్మ వద్ద సనాతన వైదిక ప్రతిష్ఠ కార్యక్రమాలను అభ్యసించడమేగాక తెలంగాణలో వందకు పైగా ఆలయాల్లో ప్రతిష్ఠలు చేసి, ధర్మవ్యాప్తికి దోహదపడ్డారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాల ద్వారా వచ్చే అనేక ధర్మ సందేహాలకు శాస్త్ర ఆధారమైన సమాధానాలు ఇచ్చేవారు. శర్మకు భార్య, కుమార్తె, నలుగురు కుమారులు ఉన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 03:26 AM