Share News

TS News: హాస్టల్ గదిలో విద్యార్థినుల ఆత్మహత్య

ABN , Publish Date - Feb 04 , 2024 | 07:25 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తమ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భువనగిరిపట్టణంలోని గల్స్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదె వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

TS News: హాస్టల్ గదిలో విద్యార్థినుల ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తమ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భువనగిరి పట్టణంలోని గల్స్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదె వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇతర విద్యార్థుల సమాచారం మేరకు అంబులెన్స్‌లో మృతదేహాలను భువనగిరిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన కుటుంబసభ్యులు తమ పిల్లల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. అయితే విద్యార్థినుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 04 , 2024 | 07:49 AM