Share News

CM Chandrababu: ఏపీలో ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్..

ABN , Publish Date - Aug 05 , 2024 | 02:29 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు తెలిపారు. ఇకపై కాన్ఫరెన్సులు గంటలు, రోజుల తరబడి ఉండవంటూ నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

CM Chandrababu: ఏపీలో ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు తెలిపారు. ఇకపై కాన్ఫరెన్సులు గంటలు, రోజుల తరబడి ఉండవంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్లతో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ మధ్య అధికారులతో తాను నిర్వహిస్తున్న సమావేశాలు అర్ధగంట లేదా మహా అయితే గంటన్నరలోపే ముగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారులు సమావేశాలకు ప్రిపేర్ అయి రాకపోతే మళ్లీ సమావేశం పెట్టుకుందామంటూ తాను వెళ్లిపోతున్నట్లు చెప్పారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని కలెక్టర్లకు హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: పవన్‌కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు

AP News: నూజివీడులో దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

Updated Date - Aug 05 , 2024 | 02:29 PM