మంత్రగాళ్ళు జాగ్రత్త.. ఒక్కొక్కరిని లేపే..

ABN, Publish Date - Oct 15 , 2024 | 08:46 PM

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో వాల్ పోస్టర్ల కలకలం రేగింది. కట్లకుంట గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆగంతకులు వాల్ పోస్టర్లు అంటించారు. గ్రామంలో ఉన్న మంత్రగాళ్లు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మంత్రగాళ్లను ఒక్కొక్కరిగా హత్య చేయబోతున్నామంటూ ఆ వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో వాల్ పోస్టర్ల కలకలం రేగింది. కట్లకుంట గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆగంతకులు వాల్ పోస్టర్లు అంటించారు. గ్రామంలో ఉన్న మంత్రగాళ్లు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మంత్రగాళ్లను ఒక్కొక్కరిగా హత్య చేయబోతున్నామంటూ ఆ వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని గ్రామస్తులు చూడి చూడనట్లు ఉండాలన్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 15 , 2024 | 08:48 PM