వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం..

ABN, Publish Date - Apr 23 , 2024 | 11:28 AM

నంద్యాల జిల్లా: నందికొడ్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్య నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన నందికొడ్కూర్ తాహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

నంద్యాల జిల్లా: నందికొడ్కూరు (Nandikodkur) ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్య (Githa Jayasurya) నామినేషన్ వేశారు. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ (Rally)గా వెళ్లిన ఆయన నందికొడ్కూర్ తాహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ శివానందరెడ్డి (Sivananda Reddy), టీడీపీ నాయకులు (TDP Leaders) పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం జయసూర్య మీడియాతో మాట్లాడుతూ శివానందరెడ్డి నాయకత్వంలో 2024 ఎన్నికల్లో నందికొడ్కూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలు అధికార వైసీపీపై విసుగుచెంది ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని గిత్త జయసూర్య తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

భీమిలో వైసీపీకి షాక్ మీద షాక్..

తొలి సంతకం దానిపైనే: చంద్రబాబు

ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ప్రతి పనికి ఓ రేటు..

జగన్ ‘నాడు-నేడు’ బాగోతం..

నా గెలుపు ఖాయం

Read Latest AP News and Telugu News

Read Latest National News and Sports

Updated at - Apr 23 , 2024 | 11:34 AM