TG News: మైసిగండి మైసమ్మ అమ్మవారి గర్భగుడిలో అద్భుత దృశ్యం

ABN, Publish Date - May 19 , 2024 | 05:24 PM

రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ అమ్మవారి గర్భగుడిలో ఈరోజు(ఆదివారం) అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం పూజారులు అమ్మవారికి పూజ నిర్వహిస్తున్న సమయంలో గర్భగుడిలోని దేవతామూర్తిపై సూర్యకిరణాలు నిలువుగా ప్రసరించాయి. ఈ దృశ్యం చూసిన పూజారులు, భక్తులు మంత్రముగ్ధులయ్యారు.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ అమ్మవారి గర్భగుడిలో ఈరోజు(ఆదివారం) అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం పూజారులు అమ్మవారికి పూజ నిర్వహిస్తున్న సమయంలో గర్భగుడిలోని దేవతామూర్తిపై సూర్యకిరణాలు నిలువుగా ప్రసరించాయి. ఈ దృశ్యం చూసిన పూజారులు, భక్తులు మంత్రముగ్ధులయ్యారు.


ఇలాంటి దృశ్యాన్ని ఈ ఆలయంలో చూడటం ఇదే తొలిసారని పూజారులు, భక్తులు చెబుతున్నారు. ప్రతి ఆదివారం వేలాదిమంది భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఏమైనా మొక్కులు మొక్కితే తీరుస్తారని భక్తులు విశ్వసిస్తారని పూజారులు అంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

TG News: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రత్మకం: ప్రేమేందర్ రెడ్డి

Ponguleti: ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి..

Congress: ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి: చింతా మోహన్

Updated at - May 19 , 2024 | 05:29 PM