Ramoji Rao Memorial Meet: రామోజీరావు సంస్మరణ సభ.. తరలివచ్చిన ప్రముఖులు
ABN , Publish Date - Jun 27 , 2024 | 06:22 PM
ఇటీవల స్వర్గస్తులైన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను గురువారం ఆంధ్రప్రదేశ్లోని కానూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి..
![Ramoji Rao Memorial Meet: రామోజీరావు సంస్మరణ సభ.. తరలివచ్చిన ప్రముఖులు](https://media.andhrajyothy.com/media/2024/20240625/Ramoji_Rao_Memorial_Meet_d6335a8174_v_jpg.webp)
ఇటీవల స్వర్గస్తులైన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభను గురువారం ఆంధ్రప్రదేశ్లోని కానూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ సభకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర, మురళీ మోహన్.. సినిమా రంగం నుంచి దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, జయసుధలతో పాటు మరెందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వీళ్లందరూ రామోజీరావుతో తమ అనుబంధాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు.