Share News

YSRCP: ఈసీ నిబంధనలు పట్టించుకోని జగన్..

ABN , Publish Date - Feb 19 , 2025 | 11:45 AM

ఎన్నికల అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు వచ్చారు. మిర్చి యార్డ్‌కు వెళ్లారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, పర్యటన వద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదు.

YSRCP: ఈసీ నిబంధనలు పట్టించుకోని జగన్..
Jagan Guntur visit violation

గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు (YSRCP Chief), మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) బుధవారం గుంటూరు (Guntur) పర్యటనకు వెళ్లారు. అక్కడ మిర్చి యార్డ్‌ (Mirchi Yard)లో రైతుల (Farmers)ను కలిసారు. ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా రాజకీయ సమావేశాలు, సభలకు అనుమతి లేదని, జగన్‌ను మిర్చి యాడ్‌లోకి అనుమతించవద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ (Guntur Dist. Collector) ఆదేశాలు జారీ చేసినా వాటికి భేఖాతరు చేశారు. యార్డ్‌లోకి వస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించినా వాటిని జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు పట్టించుకోలేదు. అధికారుల ఆదేశాలు లెక్కచేయకుండా జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లారు.

ఈ వార్త కూడా చదవండి..

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఇక్కడంటే..


గిట్టుబాటు ధరలేక మిర్చి ధరలు ఇబ్బందులు పడుతున్నారనే కారణంతో బుధవారం జగన్ మిర్చి యార్డ్‌కు వచ్చారు. అయితే గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు అవకాశం లేదని పేర్కొంటూ ఈసీ అధికారులు జగన్ పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ జగన్ బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు జై జగన్ అంటూ వీరంగం సృష్టించారు. మరోవైపు అధికారుల ఆదేశాలను దిక్కరించిన జగన్‌పై పోలీసులు ఎలాంటి కేసులను నమోదు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.


ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో మిర్చి యార్డులో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం అంటూ అధికారులు మైకులో ప్రచారం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఎనౌన్స్‌మెంట్ చేశారు. అయితే జగన్ పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఎలాగైనా జగన్ గుంటూరు పర్యటనకు వస్తారని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.

మిర్చియార్డులో రైతులను జగన్‌ పరామర్శిస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం సాయంత్రం బృందావన్‌ గార్డెన్స్‌ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిర్చి యార్డుకు బుధవారం జగన్‌ వస్తారని రైతుల కష్ట, నష్టాలను తెలుసుకుంటారని, వారి ఆవేదనను వింటారని చెప్పారు. రైతులు తమ సమస్యలను జగన్‌కు వివరిస్తే తద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి న్యాయం చేసేందుకు కృషి చేస్తారన్నారు. మరోవైపు, మిర్చి రైతుల పరామర్శకు ఎన్నికల కోడ్ కి సంబంధం లేదని.. తాము పబ్లిక్ మీటింగులు పెట్టడం లేదని.. రైతుల సమస్యలు మాత్రమే వింటామని అంబటి అన్నారు. రైతులకు అండగా ఉంటాం అన్నారు..


జగన్‌ పర్యటనకు ఈసీ అనుమతి నిరాకరణ

మిర్చి రైతులను పరామర్శించేందుకు బుధవారం గుంటూరు రానున్న జగన్‌కు ఎన్నికల కమిషన్‌ అనుమతి నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని ఎన్నికల కమిషన్‌ తేల్చి చెప్పింది. అయితే జగన్‌ పర్యటన షెడ్యూలును వైఎస్సార్‌సీపీ నేతలు విడుదల చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు మిర్చి యార్డుకు వస్తారని 12 గంటల వరకు యార్డులో రైతులతో చర్చించి తరువాత తిరిగి తాడేపల్లికి వెళతారని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత..

గుంటూరు మిర్చి యార్డుకు జగన్ రెడ్డి

దుర్గగుడిలో ఉద్యోగుల అంతర్గత బదిలీల్లో మాయాజాలం

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 19 , 2025 | 11:45 AM