AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
ABN , Publish Date - Feb 24 , 2025 | 10:25 AM
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతూ నినాదాలు చేశారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions) సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. (Governor Abdul Nazeer speech) గవర్నర్ ప్రసంగానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs) అడ్డుతగులుతూ.. నినాదాలు చేశారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ప్రతిపక్షాన్ని గుర్తించండి’ అంటూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై గవర్నర్ మాట్లాడారు. ప్రజల గొంతు వినాలంటే ప్రతిపక్షం హోదా ఇవాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..
వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. జగన్ తన సీట్లోనే కూర్చొని చూస్తున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జగన్ పక్క పక్కనే కూర్చొని చూస్తున్నారు. కొద్దిసేపు నినాదాలు చేసి సభ నుంచి వైఎస్సార్సీపీ ఎంఎల్ఏలు వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ కీలక ఆదేశాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News