Share News

Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

ABN , Publish Date - Jan 29 , 2025 | 06:08 PM

Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమార స్వామితో కలిసి ఆ శాఖ సహాయ మంత్రి బి. శ్రీనివాస వర్మ సందర్శించనున్నారు.

Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
MOS B Srinivas Verma

న్యూఢిల్లీ, జనవరి 29: రాష్ట్రీయ ఇస్పాత్ నిగామ్ లిమిటెడ్‌ (ఆర్ఐఎన్ఎల్)కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం ప్రకటించిన అనంతరం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి సందర్శించేందుకు గురువారం వస్తున్నారని ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి బి.శ్రీనివాస వర్మ విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సంకల్పంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యమైందని స్పష్టం చేశారు.

Kumara-swamy.jpg

స్టీల్ ప్లాంట్ కార్మికులతో చర్చించి.. కేంద్ర పెద్దలను ఒప్పించడం ద్వారా ప్యాకేజీ తీసుకువచ్చామని చెప్పారు. సమిష్టి కృషి ద్వారా ప్లాంట్‌కి ప్యాకేజీ తెచ్చినట్లే.. సమిష్టిగా పని చేసి ప్లాంట్‌ను లాభల్లోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. స్టీల్ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.


దేశంలో 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి పెంచాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించుకొన్నారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ఇచ్చిన ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలని చెల్లించే అంశంపై తాను, కుమార స్వామి ఆలోచన చేస్తు్న్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నామన్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తారన్న ఆలోచన ఎవరు చేయ వద్దంటూ కార్మికులకు సూచించారు.

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్


ఆంధ్రుల ఉద్యమ ఫలితంగా స్టీల్ ప్లాంట్ వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాంటి స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకు వెళ్లామని పేర్కొన్నారు. ప్యాకేజీ కావాలని తొలుత అడిగి.. ఆ తర్వాత ప్యాకేజీ మోసం అంటూ వ్యాఖ్యలు చేయడం బాధ్యతా రాహిత్యమన్నారు.

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు


స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని ఎవరు చెప్పిన నమ్మొద్దంటూ ప్రజలకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. అయితే స్టీల్ ప్లాంట్‌కి రూ. 35 వేల కోట్లు మేర బకాయిలుగా ఉన్నాయన్నారు. రూ.18 వేల కోట్లు బ్యాంకులకు, మెటీరియల్ సప్లై చేసిన వారికి రూ. 17 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని గుర్తు చేశాు. రూ. 11,440 కోట్లతో స్టీల్ ప్లాంట్ వినియోగంలోకి తీసుకువచ్చి నష్టాలు పూడ్చే పని మొదలు పెట్టాల్సి ఉందన్నారు. అందుకోసం తొలుత ప్లాంట్ గాడిన పడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ


ఈ ఏడాది ఆగస్టు నాటికి మూడు బ్లాస్ట్ ఫర్నిస్‌లు పని చేయలనేది కేంద్రం యొక్క ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ అంశంలో కేంద్రం చిత్తశుద్ధిని ఎవరు అనుమనించాల్సిన అవసరం లేదన్నారు. ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన అనంతరం నష్టాల నుంచి బయటకు వచ్చిన తరువాత ఏం చేయాలనే దానిపై కేంద్రం ఆలోచన చేస్తుందన్నారు. సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం కష్టతరమైన అంశమని ఆయన అభివర్ణించారు. నష్టాల నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ సంస్థ విలీనాన్ని పరిశీలిస్తామని సెయిల్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారన్నారు.

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు


సెయిల్‌లో 65 శాతం ప్రభుత్వ వాటా కాగా.. మిగిలిన 35 శాతం పబ్లిక్ వాటా ఉందని గుర్తు చేశారు. సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీన ప్రక్రియకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్లాంట్ పరిస్థితులపై తమకు అవగాహన ఉంది కాబట్టే ప్యాకేజి సాధించామన్నారు.


స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి.. ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌లో రూ. 240 కోట్ల వేతన బకాయిలు ఉన్నాయని చెప్పారు. గతేడాది అక్టోబర్ వరకు జీతాలు చెల్లించామని.. అనంతరం 50 శాతం.. 30 శాతం జీతాలు చెల్లిస్తున్నామని వివరించారు. అయితే కార్మికుల జీతాల చెల్లింపు తమ మొదటి ప్రయారిటీ అని తెలిపారు.


కేంద్రం 7 నెలల్లో రూ. 3 లక్షల కోట్ల పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించిందని గుర్తు చేశారు. అలాగే 2025 -26 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఉంటుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 06:43 PM