Share News

ATM Fee Hike: ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేసే వారికి అలర్ట్..ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:47 PM

ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల సమయంలో కూడా మీరు ఎక్కువగా ATMల నుంచి మనీ విత్ డ్రా చేస్తున్నారా. అయితే ఓసారి మారిన ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి. లేదంటే మీరు పరిమితికి మించి ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

 ATM Fee Hike: ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేసే వారికి అలర్ట్..ఆర్‌బీఐ కీలక నిర్ణయం..
RBIs Decision ATM Withdrawals

మీరు ప్రతి నెలలో కూడా ఏటీఎం నుంచి నగదును ఎక్కువ సార్లు విత్ డ్రా చేస్తున్నారా. అయితే ఒక్కసారి మారిన ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి. లేదంటే మీరు నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంటర్‌చేంజ్ ఛార్జీలను పెంచింది. దీంతో వినియోగదారులు తమ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత అదనపు ఛార్జీలు చెల్లించాలి. ATM ఇంటర్‌చేంజ్ ఛార్జీలు అనేవి ATM సేవలను అందించడానికి ఒక బ్యాంకు మరొక బ్యాంకు చెల్లించే ఛార్జీ. ఈ రుసుము, సాధారణంగా ప్రతి లావాదేవీకి స్థిర మొత్తం, తరచుగా వారి బ్యాంకింగ్ ఖర్చులలో భాగంగా వినియోగదారులకు బదిలీ చేయబడుతుంది.


ఖర్చుల నేపథ్యంలో

RBI ఈ ఛార్జీలను సవరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా వైట్-లేబుల్ ATM ఆపరేటర్ల అభ్యర్థనల మేరకు, పెరుగుతున్న కార్యాచరణ ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మే 1, 2025 నుంచి వినియోగదారులు ఉచిత పరిమితిని దాటి ప్రతి ఆర్థిక లావాదేవీకి అదనంగా రూ.2 చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ATM నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి ప్రతి లావాదేవీకి రూ.19 ఖర్చవుతుంది. ఇది గతంలో ఉన్న రూ.17 నుంచి పెరిగింది. అలాగే, బ్యాలెన్స్ విచారణ వంటి ఆర్థికేతర లావాదేవీలకు రుసుము కూడా రూ.1 పెరుగుతుంది. దీంతో ఇప్పుడు ప్రతి లావాదేవీకి రూ.7 ఖర్చవుతుంది. ప్రస్తుతం అనేక బ్యాంకులు ఏటీఎంల ద్వారా ఉచితంగా ఐదు లావాదేవీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.


డిజిటల్ చెల్లింపుల పెరుగుదల

ATMలు ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల విషయంలో చాలా కీలకంగా ఉండేవి. కానీ ఇటీవల డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పెరిగిన నేపథ్యంలో వీటి వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఆన్‌లైన్ వ్యాలెట్లు, UPI లావాదేవీల సౌలభ్యం నగదు ఉపసంహరణల అవసరాన్ని భారీగా తగ్గించింది. ప్రభుత్వ డేటా ప్రకారం, భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విలువ FY14లో రూ.952 లక్షల కోట్లుగా ఉంది. FY23 నాటికి ఇది రూ.3,658 లక్షల కోట్లుగా ఉండేది.


వినియోగదారులపై ప్రభావం

ఈ కొత్త రుసుము పెంపు నేపథ్యంలో ATMలపై ఆధారపడే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. దీంతో ఏటీఎం విత్ డ్రా చేసే వారి సంఖ్య రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థకు ఏటీఎంల విషయంలో కొంత ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపులు మరింత పెరిగే ఛాన్సుంది.


ఇవి కూడా చదవండి:

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:48 PM