Share News

Atishi: ఆప్ విపక్ష నేతగా అతిషి.. ఈ పదవికి తొలి మహిళగా రికార్డు

ABN , Publish Date - Feb 23 , 2025 | 03:26 PM

ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అతిషిని ఏకగ్రీవంగా నిర్ణయించామని, పార్టీ క్లిష్ట కాలంలో ఢిల్లీ సీఎంగా ఆమె సేవలందించారని ప్రశంసించారు. ఆరోగ్యకరమైన ప్రతిపక్షంగా ఆప్ తన బాధ్యతలను నెరవేరుస్తుందని చెప్పారు.

Atishi: ఆప్ విపక్ష నేతగా అతిషి.. ఈ పదవికి తొలి మహిళగా రికార్డు

న్యూఢిల్లీ: అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విపక్ష నేతగా (Leader of the Opposition) మాజీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) పేరు ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ తొలి సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సమవేశానికి హాజరయ్యారు.

PM Modi Mann ki Baat: మన్ కీ బాత్.. ఇస్రోకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ..


సమావేశానంతరం ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అతిషిని ఏకగ్రీవంగా నిర్ణయించామని, పార్టీ క్లిష్ట కాలంలో ఢిల్లీ సీఎంగా ఆమె సేవలందించారని ప్రశంసించారు. ఆరోగ్యకరమైన ప్రతిపక్షంగా ఆప్ తన బాధ్యతలను నెరవేరుస్తుందని చెప్పారు.


అతిషి మాట్లాడుతూ, ప్రజలు ఆప్‌కు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, బలమైన ప్రతిపక్షం ఎలా పనిచేస్తుందో తాము చూపిస్తామని తెలిపారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే మహిళలకు ఆర్థిక సాయం అంశాన్ని ఆమోదించి మార్చి 8న నాటికి వారి అకౌంట్లలో రూ.2,500 వేస్తామని మోదీ హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఈ హామీని అమలయ్యేలా చూడం తమ బాధ్యత అని అతిషి చెప్పారు. ఎన్నికలకు ముందే తాము కాగ్ నివేదికను స్పీకర్‌కు పంపామని, దానిని ఆయన ప్రెజెంట్ చేసినట్టు వాళ్లు (బీజేపీ) గందరగోళం సృష్టించారని తెలిపారు.


కాగా, ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది. బీజేపీ నేత విజేంద్ర గుప్తాను స్పీకర్‌గా నామినేట్ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అరవింద్ సింగ్ లవ్లీని ఎల్జీ నియమించారు. 25వ తేదీన గత ఆప్ ప్రభుత్వం అవినీతి, అవకతవకలపై కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.


ఇవి కూడా చదవండి...

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2025 | 03:26 PM