Delhi Budget 2025: లక్ష కోట్లతో చారిత్రక బడ్జెట్
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:56 PM
ఢిల్లీ-ఎన్సీఆర్లో రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హత కలిగిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్లు కేటాయించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) మంగళవారంనాడు ప్రవేశపెట్టారు. రూ. లక్ష కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ చరిత్రాత్మకమని సీఎం అభివర్ణించారు. 26 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావడం విశేషం.
Tollgates: వాహనదారులకు పిడుగులాంటి వార్త.. 1 నుంచి టోల్ బాదుడు..
'అవినీతి, అసమర్ధ' శకం ముగిసిందని, కొత్త బడ్జెట్లో మూలధన వ్యయం రెట్టింపు చేశామని సీఎం తెలిపారు. రూ.లక్ష కోట్లతో బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గత బడ్జెట్ కంటే ఇది 31.5 శాతం ఎక్కువని, ఇదొక అసాధారణ, చారిత్రక బడ్జెట్ అని చెప్పారు. ఈ బడ్జెట్ ప్రధానం 10 కీలక రంగాలపై దృష్టి సారించింది. విద్యుత్, రోడ్లు, నీళ్లు, అనుసంధానం వంటివి ఇందులో ఉన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హత కలిగిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్లు కేటాయించారు. అదనంగా, రాజధానిలో హెల్త్కేర్ సర్వీసులను మెరుగుపరచేందుకు ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకు రూ.2,144 కోట్లు కేటాయించారు.
బడ్జె్ట్లో కీలకాంశాలు..
-గత బడ్జె్ట కంటే మూలధన వ్యయం దాదాపు రెట్టింపు చేశారు. గత ఏడాది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.15,000 కోట్లు ఉండగా.. దానిని ఈసారి రూ.28,000 కోట్లకు పెంచారు.
-ఢిల్లీ-ఎన్సీఆర్లో రవాణా అనుసంధానం మెరుగుపరచేందుకు రూ.1,000 కోట్లు కేటాయించారు.
-బ్రిడ్జిల నిర్మాణం, నిర్వహణకు రూ.3,843 కోట్లు
-పీఎం జన్ ఆరోగ్య యోజనకు రూ.2,144 కోట్లు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద రూ.10 లక్షల కవరేజీ.
-మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలనెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్ల కేటాయింపు.
-మహిళా భద్రతను పెంచేందుకు సిటీ అంతటా 50,000 సీసీటీవీల ఏర్పాటు.
-సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూ.10,047 కోట్లు
-గర్భిణీ మహిళలకు పోషకాహారం అందించే మాతృత్వ వందన్ యోజనకు రూ.210 కోట్లు కేటాయింపు
-1,000 అధునాతన అంగన్వాడి కేంద్రాల నిర్మాణం.
-యమునా జలాల ప్రక్షాళనకు రూ.500 కోట్లు కేటాయింపు.
-సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (ఎస్టీపీ) మరమ్మతు, ఆధునీకరణకు రూ.500 కోట్లు, పాత సీవర్ లైన్స్ను మార్చేందుకు రూ.250 కోట్లు.
-స్వచ్ఛమైన తాగనీరు, పారిశుధ్యం, సంబంధిత ప్రాజెక్టులకు రూ.9,000 కోట్లు కేటాయింపు.
-మునక్ కెనాల్ ద్వారా నీటి పైప్లైన్ల ఏర్పాటు, నీటి చోరీని అరికెట్టేందుకు ఇంటెలిజెన్స్ మీటర్ల ఏర్పాటుకు రూ.200 కోట్లు కేటాయింపు.
-ఆరోగ్య రంగానికి రూ.6,874 కోట్లు కేటాయింపు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు, ఆయుష్యాన్ ఆరోగ్య మందిర్ల విస్తరణపై దృష్టి.
-స్మమ్ క్లస్టర్ల అభివృద్ధికి రూ.696 కోట్లు, ఢిల్లీ వ్యాప్తంగా అటల్ క్యాంటీన్ల ఏర్పాటుకు రూ.100 కోట్లు.
-పీఎం ఎస్హెచ్ఆర్ఐ స్కూళ్ల స్ఫూర్తితో విద్యా వ్యవస్థలో సంస్కరణల కోస సీఎం ఎస్హెచ్ఆర్ఐ స్కూళ్ల ప్రారంభం.
-ఈ స్కూళ్ల కోసం 2026 అర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయంపు.
-10వ తరగతి ఉత్తీర్ణలైన 1,200 మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు. ఇందుకోసం రూ.750 కోట్లు కేటాయింపు.
- ఢిల్లీ స్కూళ్లలో ఏపీజే అబ్దుల్ కలామ్ పేరుతో 100 ల్యాంగ్వేజ్ ల్యాబ్ల ఏర్పాటుకు రూ.21 కోట్లు కేటాయింపు.
-175 ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు, స్మార్ట్ క్లాసులు. ఇందుకోసం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయింపు.
-నరేలాలో రూ.500 కోట్లతో ఎడ్యుకేషన్ హబ్
-కొత్త పారిశ్రామిక, గిడ్డంగుల విధానం ప్రవేశపెట్టడం.
-వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు సింగిల్ విండో సిస్టం.
-పారిశ్రామిక వాడల అభివృద్ధి
-ట్రేడర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు.
-ప్రతి రెండేళ్లకు ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం.
-రూ.1,157 కోట్లతో రూరల్ డవలప్మెంట్ బోర్డు ఏర్పాటు.
-ఢిల్లీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్కు పెండింగ్ గ్రాంటుల విడుదల.
-మైథిలి, భోజ్పురి అకాడమీ బడ్జెట్ రెట్టింపు చేయడం.
-ఘమన్హేరాలో రూ.40 కోట్లతో మోడల్ గోశాల ఏర్పాటు.
-ఢిల్లీలోని గోశాలలన్నింటికీ పెండింగ్ గ్రాంటులను విడుదల చేయడం.
-ఢిల్లీలో హోంగార్డుల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచడం
-ఢిల్లీలో కొత్త జైల్ కాంప్లెక్స్ నిర్మాణం.
ఇవి కూడా చదవండి..