Drones: పాక్ నుంచి డ్రోన్లతో మాదకద్రవ్యాలు!
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:39 AM
పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్లోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాల రవాణా జరుగుతోంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్లోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాల రవాణా జరుగుతోంది. సరిహద్దు భద్రతా దళం(బీఎ్సఎఫ్) గత నాలుగేళ్లుగా అమృత్సర్లో కూల్చేసిన డ్రోన్లలో 75ు వరకు పాకిస్థాన్లోని లాహోర్ నుంచి ప్రయోగించినవేనని విశ్లేషణలో వెల్లడైంది.
గతేడాది అంతర్జాతీయ సరిహద్దు మీదుగా 251 వరకు డ్రోన్లు భారత్లోకి ప్రవేశించగా, వాటిలో 184 డ్రోన్లు(75 శాతం) పంజాబ్లోని అమృత్సర్లోకి, మరో 42 డ్రోన్లు పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోకి, ఇంకో 14 డ్రోన్లు గుర్దా్సపూర్లోకి వచ్చినట్టు భద్రతాదళాలు గుర్తించాయి. 2019 నుంచే పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలు డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారత భూభాగంలోకి పంపిస్తున్నట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి.