Share News

Terrorism: దాడుల వెనక ఐఎస్‌?

ABN , Publish Date - Jan 03 , 2025 | 04:24 AM

ట్రంప్‌ సర్కారు కొలువుదీరే వేళ.. ప్రజలంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి ఉండగా.. అమెరికాలో ఉగ్రవాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుస ఘటనలతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

Terrorism: దాడుల వెనక ఐఎస్‌?

  • అమెరికా న్యూ ఆర్లిన్స్‌ ఘటన దుండగుడు

  • జబ్బార్‌ కారులో ఇస్లామిక్‌ స్టేట్‌ జెండా

  • నిర్ధారించిన అధ్యక్షుడు జోబైడెన్‌, ఎఫ్‌బీఐ

  • ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య

  • లాస్‌ వెగా్‌సలో ట్రంప్‌ హోటల్‌ వద్ద కారు

  • బాంబు పేలుడు, ఒకరి మృతి రెండు ఘటనలకు సంబంధం!: మస్క్‌

న్యూయార్క్‌, జనవరి 2: ట్రంప్‌ సర్కారు కొలువుదీరే వేళ.. ప్రజలంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి ఉండగా.. అమెరికాలో ఉగ్రవాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుస ఘటనలతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున న్యూ ఆర్లిన్స్‌లో.. ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రేరణ పొందిన మాజీ సైనికుడు షంషుద్దీన్‌ జబ్బార్‌ ట్రక్కుతో దాడి చేసి 15 మందిని పొట్టనబెట్టుకోగా.. లాస్‌ వెగా్‌సలోని ట్రంప్‌ హోటల్‌ సమీపంలో కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. న్యూయార్క్‌ క్వీన్స్‌కౌంటీలో.. అమజురా నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన నమోదైంది. ఇక్కడ 11 మందికి గాయాలయ్యాయి.


మాజీ సైనికుడే ఉగ్రవాది!

న్యూ ఆర్లిన్స్‌ ఘటనలో నిందితుడిని షంషుద్దీన్‌ జబ్బార్‌(42)గా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎ్‌ఫబీఐ) అధికారులు గుర్తించారు. అతణ్ని పోలీసు లు కాల్చి చంపగా.. ఘటనకు ఉపయోగించిన కారు లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) జెండా, పేలుడు పదార్థాలున్నట్లు నిర్ధారించారు. అతను ఒంటరి తోడేలు(లోన్‌ వోల్ఫ్‌) దాడి చేసి ఉంటాడని భావిస్తున్నారు. టెక్స ్‌సకు చెందిన జబ్బార్‌ అమెరికా పౌరుడు కాగా.. అత ను యుక్తవయసులోనే ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 2005-15 మధ్య కాలంలో అమెరికా సైన్యంలో మానవ వనరులు-సమా చార విభాగంలో మేనేజర్‌గా పనిచేశాడు. 2009లో ఆఫ్ఘానిస్థాన్‌లో కూడా విధులు నిర్వర్తించాడు. 2015-20 మధ్యకాలంలో ఆర్మీ రిజర్వ్‌లో ఐటీ నిపుణుడిగా సేవలందించాడు. గత ఏడాది నౌకాదళంలో చేరేందుకు జబ్బార్‌ పేరు ఖరారైనా.. బూట్‌క్యాంప్‌ వెళ్లకపోవడంతో తొలగించారు. 2021 నుంచి అతను డెలాయిట్‌ ఆడిటింగ్‌ సంస్థలో ఏటా 1.2 లక్ష ల డాలర్ల వేతనంతో సీనియర్‌ సొల్యూషన్‌ స్పెషలి స్ట్‌గా పనిచేశాడు. జబ్బార్‌కు గత నేర చరిత్ర కూడా పెద్దగా లేదని.. 2014లో డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన రికార్డు మాత్రం ఉందని.. 2002లో హారి్‌సకౌంటీలో ఓ చిల్లర దొంగతనం కేసులో 9 నెలలపాటు కమ్యూనిటీ సూపర్‌విజన్‌ శిక్షను అనుభవించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అతనికి రెండు పెళ్లిళ్లవ్వగా.. విడాకులు తీసుకున్నాడని, రెండో భార్య కేసులో తాను పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ట్లు, తన రియల్‌ఎస్టేట్‌ కంపెనీ కూడా నష్టాల్లో ఉం దని లాయర్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు.


ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ వైపు ఆకర్షితుడై ‘చంపడం’ అనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఎఫ్‌డీఐ గుర్తించిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మీడియాకు చెప్పారు. ఘటనకు ముందు అతను సోషల్‌ మీడియాలో సెల్ఫీ వీడియోను పోస్టు చేశాడని, ఎఫ్‌బీఐ కూడా దాడిపై తనకు ముందుగానే సమాచారం ఇచ్చిందని వివరించారు. ‘టూరో’ అనే యాప్‌ సాయంతో ఫోర్డ్‌ ఎఫ్‌-150లైటెనింగ్‌ అనే భారీ ఎలక్ట్రిక్‌ పికప్‌ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడని, ఆ వాహనంతోనే న్యూ ఆర్లిన్స్‌లో దారుణానికి ఒడిగట్టాడని గుర్తించామన్నారు. ఈ ఘటనలో బుధవారం 10 మంది చనిపోగా.. గురువారానికి మృతుల సంఖ్య 15కు పెరిగినట్లు తెలిపారు. మ రోవైపు.. లాస్‌ వెగా్‌సలోని డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన ఇంటర్నేషనల్‌ హోటల్‌ వెలుపల టెస్లా సైబర్‌ట్రక్‌ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఏడుగురు గాయపడ్డారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన జరిగిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే.. న్యూ ఆర్లిన్స్‌, లాస్‌ వెగాస్‌ సంఘటనలకు సంబంధం ఉండి ఉంటుందని స్పేస్‌ ఎక్స్‌ చీఫ్‌ ఈలాన్‌ మస్క్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనల్లోనూ దుండగులు ‘టూరో’ నుంచి వాహనాలను అద్దెకు తీసుకున్నట్లు గుర్తుచేశారు. కాగా, లాస్‌ వెగాస్‌ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే.. ఫ్రిమాంట్‌ స్ట్రీట్‌లో ఓ దుండగుడు హల్‌చల్‌ చేశాడు. ఓ బస్సులో తనను తాను బంధించుకున్న దుండగుడి వద్ద పేలుడు పదార్థాలున్నట్లు పోలీసులు అనుమానించారు. న్యూ ఆర్లిన్స్‌ తరహాలో దాడికి దుండగుడు కుట్రపని ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, న్యూ యార్క్‌లో మరోమారు కాల్పుల కలకలం నెలకొంది. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బుధవారం రాత్రి క్వీన్‌కౌంటీలోని అమజురా నైట్‌క్లబ్‌లో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.


దాడిని ఖండించిన ప్రధాని మోదీ

అమెరికాలోని న్యూ ఆర్లిన్స్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated Date - Jan 03 , 2025 | 04:24 AM