Share News

Kho Kho Championship: పురుషుల ఖో ఖో టైటిల్ కూడా మనదే.. సరికొత్త రికార్డ్

ABN , Publish Date - Jan 19 , 2025 | 09:09 PM

భారత పురుషుల జట్టు నేపాల్‌ను ఓడించి తొలిసారిగా ఖో ఖో ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్లో మొదటి నుంచే నేపాల్ పై భారత్ ఆధిక్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.

Kho Kho Championship: పురుషుల ఖో ఖో టైటిల్ కూడా మనదే.. సరికొత్త రికార్డ్
India Men's Team Wins Kho Kho Championship

భారత పురుషుల జట్టు (india team) ఫైనల్‌లో నేపాల్‌ (nepal)ను ఓడించి ఖో ఖో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ టైటిల్ మ్యాచ్‌లో భారత్ 54-36 తేడాతో నేపాల్‌ను ఓడించింది. అయితే పురుషుల జట్టు కంటే ముందు, భారత మహిళల జట్టు కూడా నేపాల్ మహిళలను ఓడించి టైటిల్ గెలుచుకుంది. రెండు జట్లు కూడా ఒకేసారి గెల్చుకోవడం విశేషం. ఢిల్లీలో (delhi) జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి నేపాల్‌పై భారత్ ఒత్తిడిని కొనసాగించింది. ఆ క్రమంలో తొలి ఆధిక్యం సాధించిన తర్వాత, భారత ఆటగాళ్ళు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించారు.


ఖాతా తెరిచే అవకాశం కూడా..

2025 ఖో-ఖో ప్రపంచ కప్ పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో గొప్ప ఆరంభాన్ని సాధించింది. ఆ క్రమంలో మొదటి మలుపులో 26 పాయింట్లు సాధించారు. నేపాల్ జట్టుకు కనీసం ఖాతా తెరవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. రెండో మలుపులో, నేపాల్ స్వల్పంగా పుంజుకుని మొత్తం 18 పాయింట్లు సాధించింది, కానీ భారత జట్టు 8 పాయింట్ల ఆధిక్యాన్ని కొనసాగించగలిగింది. మూడో మలుపులో భారత పురుషుల ఖో-ఖో జట్టు అద్భుతమైన పునరాగమనం చేసి 50 పాయింట్లను దాటింది. దీంతో నేపాల్‌ టైటిల్ పోరుకు చాలా దూరమైంది.


నాల్గో మలుపులో టీం ఇండియా..

నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల ఖో-ఖో జట్టు మొదటి మూడు మలుపుల్లో ఆధిక్యాన్ని కొనసాగించగా, నాల్గో మలుపులో కూడా మనోళ్లు అదరగొట్టారు. దీంతో టీం ఇండియా 54-36 తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ ప్రపంచ కప్‌లో భారత పురుషుల ఖో-ఖో జట్టు రెండోసారి నేపాల్ జట్టును ఓడించింది. ఇందులో ఇద్దరూ గతంలో ఒక గ్రూప్ మ్యాచ్‌లో తలపడ్డారు. పురుషుల ఖో-ఖో ప్రపంచ కప్ మొదటి ఎడిషన్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి.


రెండు జట్ల విక్టరీ..

భారత మహిళల జట్టు తర్వాత, భారత పురుషుల జట్టు కూడా తొలి ఖో-ఖో ప్రపంచ కప్ ఫైనల్‌లో పొరుగున ఉన్న నేపాల్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. కఠినమైన మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి భారత్ ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీనికి ముందు భారత మహిళల జట్టు నేపాల్‌ను 78-40 తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆతిథ్య భారత జట్టు రెండు మ్యాచుల్లో కూడా గెలుపొందడంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

India Women: నేపాల్‌ను మట్టి కరించిన భారత్.. ఖో ఖో మహిళల ప్రపంచ కప్ టైటిల్ కైవసం..


Business Idea: చిన్న మొక్కలు పెంచండి.. నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదించండి..


Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి షాక్.. భారీగా తగ్గిన సంపద


SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి


Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jan 19 , 2025 | 09:30 PM