Home » Team India
భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్తో ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా ఉండాలని భారత మాజీ ఓపెనర్ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆదివారం రోజు మహిళల(Womens) T20 ప్రపంచ కప్ 2024(Womens T20 World Cup 2024) షెడ్యూల్ను(Schedule) ప్రకటించింది. తొమ్మిదో ఎడిషన్ టోర్నీ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుండగా, ఫైనల్తో కలిపి మొత్తం 23 మ్యాచ్లు జరగనున్నాయి.
ICC T20 World Cup Team: ఐసీసీ(ICC) మెన్ టీ20 ప్రపంచ కప్(T20 World Cup) ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ(BCCI). హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడనున్న ప్లేయర్స్ వీరే..
టీమిండియా రెండో సారి వన్డే ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా 13 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 ఏప్రిల్ 2న అంటే 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచింది. తద్వారా 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారత జట్టు రెండోసారి ప్రపంచకప్ను ముద్దాడింది.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన చిన్న తనంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి క్రికెట్ ఆడినట్టు చెప్పాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2024 వరకు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచే మెగా లీగ్ ప్రారంభంకానుంది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఈ సారి ఐపీఎల్ను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మొదటి విడత పోటీలు జరగనున్నాయి.
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ మళ్లీ బ్యాటు పట్టుకుని మైదానంలోకి దిగాడు. ఐపీఎల్లో ఆడడానికి పంత్కు బీసీసీఐ నుంచి కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రానున్న ఐపీఎల్ సీజన్కు ముందు ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై పెద్ద దుమారమే రేగుతోంది.
ఐపీఎల్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. గతేడాది వేలంలో ఏకంగా రూ. 13.23 కోట్లు వెచ్చించి బ్రూక్ను సన్రైజర్స్ కొనుక్కుంది.
ఇంగ్లండ్తో ధర్మశాల మ్యాచ్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్లో టాప్ లేపాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సహచరుడు బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.