Rangarajan: నన్ను దాడి నుంచి కాపాడింది తిరుమలేశుడే
ABN , Publish Date - Mar 25 , 2025 | 10:30 AM
నన్ను దాడి నుంచి కాపాడింది తిరుమల శ్రీనివాసుడేనని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పేర్కొన్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

- చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్
తిరుమల: తనపై ఫిబ్రవరి 7న జరిగిన భయంకరమైన దాడి నుంచి శ్రీవారే తనను కాపాడారని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్(Rangarajan) అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ దాడి తర్వాత కలియుగ వైకుంఠం తిరుమలను సందర్శించాలని తన మనసులో కోరిక కలిగిందన్నారు. ఈ క్రమంలో స్వామి పాదపద్మాలకు నమస్కరించుకోవాలని తిరుమలకు వచ్చానని చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: వర్క్ఫ్రం హోం జాబ్ పేరిట కుచ్చుటోపీ..
కాగా, స్వామికి భక్తులు సమర్పించే కానుకలను రోడ్ల నిర్మాణాలు వంటి వాటికి కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మపరిరక్షణ, వేదధర్మ ప్రతిష్ఠకు వినియోగించేలా టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు జాగ్రత్తలు పాటించాలని రంగరాజన్(Rangarajan) అభిప్రాయపడ్డారు. అక్కడక్కడా ఉండే దేవాలయాల్లో నిత్య కైంకర్యాలకు అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యతను టీటీడీ స్వీకరించాలని కోరారు. తిరుమలలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు కనిపిస్తున్నాయని, ఇవి ఇలానే కొనసాగాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం
పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం
Read Latest Telangana News and National News