కరెంట్ బిల్లులు ముట్టుకుంటే షాక్
ABN, First Publish Date - 2025-04-10T16:02:18+05:30 IST
Electricity Charges: ఏపీలో కరెంట్ బిల్లులను చూసి ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. గత నెలకంటే ఛార్జీలు రెట్టింపు కావడంతో మండిపడుతున్నారు.
అమరావతి, ఏప్రిల్ 10: ఏపీలో (Andhrapradesh) కరెంట్ బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీల పేరుతో బిల్లులు పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గత నెలకంటే ఛార్జీలు రెట్టింపు కావడంతో మండిపడుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచబోమని ప్రభుత్వం చెబుతుంటే బిల్లులు మోత మోగించడం ఏంటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అయితే 2014-2019 వరకు టీడీపీ హయాంలో వినియోగించిన కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది.
గత ఐదేళ్లో కలిపి మూడువేల కోట్లను 33 నెలల పాటు ట్రూఅప్ చార్జీల పేరుతో వసూలు చేశారు. కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో కూడా భారీగా వసూలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Kidney Stones: ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవాల్సిందే
Case against Thopudurthi: రాప్తాడు మాజీ ఎమ్మెల్యేపై కేసు ఫైల్.. కారణమిదే
Read Latest AP News And Telugu News
Updated at - 2025-04-10T16:02:20+05:30