Home » AICC
Telangana: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని సీఎల్పీ మీటింగ్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానాన్ని చేసిన విషయం తెలిసిందే. సీఎల్పీ నిర్ణయాన్ని ఏఐసీసీకి నివేదించేందుకు తెలంగాణ పరిశీలకులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు.
ఏఐసీసీ తెలంగాణ సీఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుందని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) పేర్కొన్నారు. సోమవారం నాడు గాంధీభవన్లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు హైదరాబాద్లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయిలో రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 5, 6 తేదీలు మంచిరోజులు కాదని ప్రమాణ స్వీకారాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు.7వ తేదీన ఉదయం రేవంత్రెడ్డితో పాటు పూర్తి స్థాయిలో మంత్రి వర్గం కొలువు తీరనున్నది.
Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక తెలంగాణ సీఎం ఎవరనే ప్రశ్న మొదలైంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) ఉదయం సీఎల్పీ సమావేశం జరుగగా.. సీఎల్పీ నేతగా ఎవరు ఉండాలని దానిపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ను దాటేసిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభాపక్షం గచ్చిబౌళిలోని ఎల్ల హోటల్లో సోమవారం ఉదయం 9.30 గంటలకు సమావేశం కానుంది.
రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు ఏఐసీసీ ఢిల్లీ అగ్ర నేతలు రానున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. కాగా ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల ( Congress candidates ) ను కాపాడుకోవడానికి ఏఐసీసీ ( AICC ) పలు ప్రణాళికలను రూపొందించింది.
Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు, నియోజకవర్గ అబ్జర్వర్లతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం జూమ్లో సమావేశమయ్యారు.
Telangana Elections: బీఆర్ఎస్, మంత్రి హరీష్రావు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే రైతుబంధు ఆగిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిచిపోవడంతో కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రైతుబంధు రైతుల హక్కన్నారు. హరీష్ రావు భాధ్యతారహిత ప్రకటన ఎందుకు చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదేశాలనే హరీష్రావు అమలు చేస్తున్నారని ఆరోపించారు.
Telangana Elections: గత కొన్ని నెలల క్రితం తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిందని.. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అర్థమైందని అఖిలభారత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు.