Share News

Mastan vali: జగన్‌ను ఓడించడానికే పొత్తులనడం సిగ్గుచేటు...

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:38 PM

Andhrapradesh: రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ప్రధాని మోదీ దుర్మార్గపు ఆలోచనలకు అండగా ఉన్నారని ఏపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శలు గుప్పించారు. గురువారం ఆంధ్రరత్నభవన్‌లో ఏపీపీసీ ఎస్సీ విభాగం నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుడిని హత్య చేసి ఇంటికి మూటకట్డి తీసుకెళ్తే ఎమ్మెల్సీపై చర్యలు లేవని.. పైగా బెయిల్ ఇప్పించి జగన్ పక్కన కూర్చో పెట్డుకున్నారని మండిపడ్డారు.

Mastan vali: జగన్‌ను ఓడించడానికే పొత్తులనడం సిగ్గుచేటు...

విజయవాడ, మార్చి 14: రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ప్రధాని మోదీ (PM Modi) దుర్మార్గపు ఆలోచనలకు అండగా ఉన్నారని ఏపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ (APCC Working President Mastan Vali) విమర్శలు గుప్పించారు. గురువారం ఆంధ్రరత్నభవన్‌లో ఏపీపీసీ ఎస్సీ విభాగం నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుడిని హత్య చేసి ఇంటికి మూటకట్డి తీసుకెళ్తే ఎమ్మెల్సీపై చర్యలు లేవని.. పైగా బెయిల్ ఇప్పించి జగన్ (CM Jagan) పక్కన కూర్చో పెట్డుకున్నారని మండిపడ్డారు. బుద్దుంటే‌ బీజేపీతో (BJP) పొత్తు పెట్టుకోనన్న చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఇవాళ ఏం ప్రయోజనాలు ఆశించి పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. జగన్‌ను ఓడించడానికే పొత్తులనడం సిగ్గుచేటని వ్యాఖ్యలు చేశారు. ఎస్సీలకు జరిగిన అన్యాయాలపై కాంగ్రెస్ పార్టీ తరపున కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ నెల 16న విశాఖలో బహిరంగ సభ నిర్వహించబోతున్నామని ప్రకటించారు. విశాఖ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Telangana CM Revanth Reddy) పాటు ఏఐసీసీ సభ్యులు (AICC Members), కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరుకానున్నారని మస్తాన్ వలీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

AP Govt: కక్ష కట్టిన జగన్ సర్కార్.. రాజధాని అమరావతిపై మరో భారీ కుట్ర

Farmers: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చేశాయ్.. రికార్డు స్థాయిలో ధర


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 14 , 2024 | 12:49 PM