Home » AP Assembly Elections 2024
Lok Sabha Election 2024 Live Updates in Telugu: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. నాలుగో విడతలో భాగంగా నేడు నాడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (INara Chandrababu Naidu) లేఖ రాశారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న వేళ.. వైసీపీ (YSRCP) తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల (Polling Booths) వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చాలా పోలింగ్ బూతుల్లో అల్లర్లు, అరాచకాలు సృష్టిస్తోంది. ఓటర్లను వైసీపీ మూకలు భయ భ్రాంతులకు గురి చేసి దాడులకు తెగబడ్డారు.
సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు (YSRCP Leaders) రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల (Polling Booths) వద్ద రెచ్చిపోతున్నారు. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడమే కాదు.. సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల (Polling Booths) వద్ద రెచ్చిపోతున్నారు.
సజావుగా సాగాల్సిన ఎన్నికల వేడుకను వైసీపీ నేతలు (YSRCP Leaders) రసాభసాగా మార్చేస్తున్నారు. అధికార మదంతో పోలింగ్ బూతుల (Polling Booths) వద్ద రెచ్చిపోతున్నారు. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడమే కాదు.. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ (TDP) కార్యకర్తలు, ఓటర్లు, రిపోర్టర్లపై దాడులకు తెగబడుతున్నారు.
అంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ వేళ.. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ వెంకట్రావు విజయం ఖాయమైందని అందరికి అర్థమైపోయింది. ఆ క్రమంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. సురంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ పరిశీలిస్తున్న యార్లగడ వెంకట్రావుపై వారు దాడికి పాల్పడ్డారు.
వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.
ఏపీలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) ఫిర్యాదు చేశారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ జరగుతుందని.. వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు అల్లర్లు, దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
జిల్లాలో పోలింగ్ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోసారి అధికారంలోకి రావడానికి పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ కుట్రలు పన్నింది. జిల్లాలోని మాచర్లలో వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు విధ్వంసం సృష్టించారు . పట్టణంలోని పోలింగ్ కౌంటర్ల వద్ద వైసీపీ నేతలు రెచ్చిపోయి అరాచకాలకు తెగబడుతున్నారు.
పల్నాడులో హింస పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల లో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని టీడీపీ చెబుతోంది. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా... శాంతి భద్రతలు కాపాడలేకపోయారని చంద్రబాబు విమర్శించారు