Home » Arrest
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్ నేత అతిశీ కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్ ( Kejriwal ) ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు.
విశాఖ నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఈ సిగరెట్లను భారీగా పట్టుకున్నారు. నగరంలోని మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో అమ్మడానికి సిద్ధంగా ఉన్న 743 ఈ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అమ్ముతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల విలువైన ఈ సిగరేట్లను పట్టుకుని సీజ్ చేశారు.
ఓ విద్యార్థి ఏకంగా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అంతే సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ విద్యార్థి ఐఐటీ-గౌహతికి చెందిన ఓ విద్యార్థి(IIT-Guwahati student) కావడం విశేషం.
మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో పైర్ అయ్యారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నానన్నారు. తాను అప్రూవర్ గా మారి సీఎంకు శిక్ష పడేలా చేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కోర్టు వద్ద గత శుక్రవారంనాడు గుమిగూడిన ప్రజలపై దుందుడుకుగా వ్యవహరించిన ఒక పోలీసు అధికారిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. ఆ అధికారిని తొలగించాలని ఢిల్లీ కోర్టును కోరారు.
లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టుపై జర్మనీ చేసిన కామెంట్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని పేర్కొంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని 'ఆప్' చెబుతోంది. మరోవైపు, నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, కేజ్రీవాల్ను జైలుకు పంపితే అక్కడ్నించే ఆయన పాలన సాగించవచ్చా అనేదే ప్రశ్న? ఇక్కడ చట్టం ఏమి చెబుతోందనే దానిపై విశ్లేషణ జరుగుతోంది.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన రాహుల్.. అధైర్యపడొద్దని, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.