Home » Balakrishna
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించడం పట్ల విదేశాల్లోని బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరమని..
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ రావడం తన తండ్రి, గురువు, దర్శకుడు, విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, లెజెండరీ ఎన్టీఆర్కు నిజంగా గర్వించదగిన క్షణమని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. భారతీయ సినిమాకు, సమాజానికి బాలకృష్ణ సహకారం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పేషెంట్లకు సేవలందిస్తున్న బలవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ విరాళం అందించారు. బాలకృష్ణ యువసేన నాయకులు 38,500 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.33 లక్షలు) చెక్కును బాలకృష్ణకు అందజేశారు.
హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని త్వరలో విస్తరిస్తామని, అలాగే ఏపీలోని తుళ్లూరు ప్రాంతంలోనూ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.
కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. నాటి సరదాలే కాదు.. చిన్న వయసులోనే పెళ్లయిన అమాయకత్వాన్ని, ఏమీ తెలియనితనంనుంచి భర్త చంద్రబాబు దన్నుతో హెరిటేజ్ సారథిగా సాధించిన విజయాలను తలపోశారు. అన్న బాలకృష్ణ డైలాగ్ను వల్లించారు.
తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిలకు బిగ్ షాక్ తగిలింది. వారి నివాసాలకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. కె.బి.ఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా మార్కింగ్ చేసింది. బాలకృష్ణ ఇంటిని ఆరడుగుల లోపల వరకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు.
ఆడవారిలాగా ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారని జేడీఎస్ నేత దేవెగౌడ కుటుంబీకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ(Congress MLA Balakrishna) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నపట్టణ నియోజకవర్గం చక్కెర గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏడ్చేవారిని ఎవరైనా నమ్ముతారా..? అన్నారు.