Home » Bhuvanagiri
ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణంలో ఒక్కో అడుగు ముందుకుపడుతోంది. రెండు నెలల్లో టెండర్లకు వెళ్లనుండగా.. అక్టోబరులో ఉత్తర భాగం పనులు మొదలుకానున్నాయి. నిర్మాణం ప్రారంభించేందుకు అనువుగా రహదారికి సాంకేతికంగా ఒక నంబరు (వర్కింగ్ టైటిల్) ఇవ్వాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికుల కష్టాలు కొంతమేర తీరనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ రియల్ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రిలో బుధవారం రాత్రి 20 నిమిషాల పాటు అంధకారం నెలకొంది. సెల్ఫోన్ టార్చ్ వెలుతురులోనే వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. వర్షాలతో ఆస్పత్రికి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రాన్స్కో అధికారులు విద్యుత్ సరఫరాను రాత్రి 9.30 గంటలకు నిలిపివేశారు.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడం, అవసరం లేకున్నా ఛత్తీ్సగఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వంటి కారణాలతో జరిగిన నష్టంపై 10 రోజుల్లోగా (ఈ నెల 16 నుంచి) ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ కోరింది. ఈ మేరకు గురువారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. పోటీ బిడ్డింగ్ ద్వారా కాకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీ్సగఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం, సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్లు కడుతుండగా..
ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విద్యుదుత్పత్తికి సిద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్లాంటులో రెండు యూనిట్లలో బాయిలర్లను మండించే ప్రక్రియ (లైటప్) మంగళవారం విజయవంతంగా పూర్తయింది. దీంతో జెన్కో అధికారులు అక్టోబర్ 10 నాటికి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రెండు యూనిట్ల నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి ప్లాంటు వద్దే సమీక్ష నిర్వహించి అక్టోబర్ నాటికి మొదటి రెండు యూనిట్లను విద్యుదుత్పత్తికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి జెన్కో యంత్రాంగం పనులను వేగంగా కొనసాగిస్తోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపై ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. దాదాపు 40వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.
నాయకుల వాహనాలంటేనే హడావుడి.. పదుల సంఖ్యలో కార్లు రయ్రయ్మంటూ దూసుకెళ్తుంటాయి.
లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సీపీఎం(CPM).. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఎం నేతలు శనివారం భేటీ అయ్యారు.
భువనగిరి: కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలన అంతా డొల్లని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని ‘సబ్కా సాత్.. సబ్కా వికాష్’ అని అన్నారని మరి అభివృద్ధి ఏదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.