Home » CM Chandrababu Naidu
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఏలూరు సీఆర్రెడ్డి కాలేజ్ హెలిపాడ్కు చేరుకుని ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరును పరిశీలిస్తారు. అనంతరం సీఆర్రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.
విజయవాడలో వరదలతో యుద్ధమే చేశామని ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. వైసీపీ ఆక్రమణలతో బుడమేరులో వరదలు వచ్చాయని మండిపడ్డారు. బుడమేరు కబ్జాకు గురయ్యిందని, గత పాలకులు కబ్జాలు చేశారని మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గతంలో బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన విశ్వప్రయత్నాలు సెప్టెంబర్-10 నాటితో ఫలించాయి. ఇక ఏపీకి కూడా శుభవార్తే వచ్చింది.. ఈ మేరకు మంగళవారం రాత్రి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది...
కూటమి ప్రభుత్వం మీద బోట్లతో వైసీపీ నేతలు పన్నిన కుట్రను దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీరియస్గా విచారించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రకాశం బ్యారేజ్ను ఇసుక పడవలు ఢీ కొట్టడం.. వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని ఆరోపణలు చేశారు.
విజయవాడలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి దెబ్బతిన్న వాహనాలు, విద్యుత్ పరికరాలు, ఇళ్ల ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులు సింగిల్ విండోలో బీమా క్లెయిమ్లు పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పత్యేక చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ప్రజలపై విద్వేషంతో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన జాతి ద్రోహం ఫలితమే బెజవాడ ముంపునకు కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలని.. కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని సూచించారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటలో ఈరోజు(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని షర్మిల ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురవడంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు ఉధృతికి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. పలువురి ఇళ్లల్లోని వస్తువులు నీటికి కొట్టుకుపోగా.. మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా పాడయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును జైలు లో పెట్టి ఏడాది పూర్తి అయిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యలు చేశారు.
నాయకుడి యొక్క గొప్పతనం, పనితనం విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తాయి. అంతా బాగున్నప్పుడు ఎవరైనా చేయగలరు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి.. వారి కష్టాల్లో భాగస్వామ్యం..