Home » Districts
పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి శనివారం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహోత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి ...
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు జీవం పోసుకున్నాయి. అత్యధికంగా కళ్యాణదుర్గంలో 86.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కణేకల్లు 70.0, ఉరవకొండ 62.8, కుందుర్పి 58.6, వజ్రకరూరు 46.2, శెట్టూరు 44.2, బెళుగుప్ప 36.8, బొమ్మనహాళ్ 34.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల కారణంగా యల్లనూరు, పెద్దపప్పూరు, కూడేరు, పుట్లూరు, కుందుర్పి, పెద్దవడుగూరు, కంబదూరు, బెలుగుప్ప, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల్లో అరటి, బొప్పాయి, టమోటా, పత్తి పంటలు ...
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం, బెళుగుప్ప, పుట్లూరు, కూడేరు, గుంతకల్లు, పామిడి, కుందుర్పి, రాప్తాడు, పెద్దవడుగూరు, విడపనకల్లు, ఉరవకొండ, గార్లదిన్నె తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. యాడికి, తాడిపత్రి, శింగనమల మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. వర్షం కారణంగా విద్యుత సరఫరాకు ...
ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలలో శుక్రవారం నుంచి జూన ఒకటో తేదీవరకూ పరీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో బుధవారం వివిధ శాఖల అదికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 ...
అడిగిన ప్రతి రైతుకు ఈ నెల 24 నుంచి విత్తనం అందించాలని కలెక్టర్ వినోద్ కుమార్.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, మార్కెటింగ్, బ్యాంకింగ్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజనలో సా గయ్యే పంటలు, విత్తన సేకరణ చర్యలు, పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18 నుంచి రైతు భరోసా కేంద్రాలలో రైతుల పేర్లు రిజిస్ట్రేషన చేయాలని సూచించారు. విత్తనం విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. వేరుశనగతోపాటు ...
రుద్రంపేట సర్కిల్ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ వరకూ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాటిన చెట్లు ఇవి. మండే ఎండలకు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చనిపోయాయి. మొక్కలు నాటించడంతో తమ పని అయిపోయినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు భావించినట్లున్నారు. హైవే నిర్మాణ క్రమంలో కొన్ని వందల వేప చెట్లను నిలువునా నరికేశారు. వాటి స్థానంలో ..
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకోసం ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన ఎంట్రెన్స టెస్ట్ను (ఐసెట్-2024) సోమవారం నిర్వహిస్తామని సెట్ చైర్మన, ఎస్కేయూ వీసీ హుస్సునరెడ్డి శనివారం తెలిపారు. సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మురళీక్రిష్ణతో కలిసి ఐసెట్ నిర్వహణ గురించి ఎస్కేయూలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 6 నుంచి ఏప్రిల్ 27వరకు ఆనలైన ద్వారా ఐసెట్కు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఏపీ, తెలంగాణ నుంచి 48,828 ...
ఉమ్మడి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ చుట్టూ కుట్రలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఓటింగ్కు దూరం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వడం, పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం ఎక్కడన్న దానిపై ఓటింగ్ రోజు వరకూ స్పష్టత ఇవ్వకపోవడం, ఫెసిలిటేషన సెంటర్లకు మధ్యాహ్నం 3 గంటలైనా బ్యాలెట్ పేపర్లు సరఫరా కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ...
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ మార్పునకు నాంది పలుకుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోను ప్రజలు బేరీజు వేసుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐదేళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పేరుతో అరకొర లబ్ధి చేకూర్చడం మినహా... అభివృద్ధిని పూర్తిస్థాయిలో విస్మరించారనే అన్ని వర్గాల ప్రజలు జగన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో అమలు పరిచిన
వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ చూపలేదు. ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన నిలబెట్టుకోలేదు. కరువు జిల్లా అనంతలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. యువత పొట్టచేతపట్టుకొని వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బటన నొక్కి.. అంతా చేసేశామనే భ్రమలో జగన ఉన్నారని యువత మండిపడుతోంది. తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత.. ఈ ఎన్నికల్లో కీలక ...