Home » Exams
Andhrapradesh: గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ఆలస్యంపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు గ్రూప్ 2 అభ్యర్థులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఏపీలోని నిరుద్యోగులు గత అయిదు సంవత్సరాలుగా గ్రూప్- 2 ఉద్యోగాల కోసం సన్నద్దం అవుతున్నామని తెలిపారు. ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జరిగిందని.. నాలుగు వారాల్లో ఫలితాలు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించిందన్నారు. ప్రిలిమినరీ ఫలితాలు విడుదల అయితే మేయిన్స్ కు సన్నద్దం కావడానికి ఎదురుచూస్తున్నామన్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు(APPSC Group 1 Exam) సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు(AP High Court). అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి(Single Judge) ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో స్టే విధించింది డివిజనల్ బెంచ్.
నిర్మల్ జిల్లా: చిన్నప్పుడే పోలియో కారణంగా దివ్యాంగుడైన తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా చూడాలని ఆ తల్లి కలలు కంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకును తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ తన కొడుకును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళి పరీక్ష రాయిస్తుంది.
గుండెపోట్లు విద్యార్థులను సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో తీవ్రమైన ఒత్తిడి కారణంగానో లేదంటే నిద్రలేమి కారణమో తెలియదు కానీ పదో తరగతి విద్యార్థిని పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్ర పాడు గ్రామంలో జరిగింది.
Andhrapradesh: ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది. నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్రోల్ అయినవారు 1,02,528 మంది ఉన్నారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
దేశంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 7 దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మొదటిదశ పోలింగ్ ఏప్రియల్ 19న ప్రారంభమై.. జూన్1న చివరి దశ పోలింగ్తో ఎన్నికలు (Elections) ముగుస్తాయి. జూన్ 4న ఓట్లు లెక్కిస్తారు. ఈ దశలో ఏప్రియల్, మే నెలలో జరగాల్సిన కొన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడనున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏపీపీఎస్సీ గ్రూప్-1ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. లక్షా 48వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
ఉపాధ్యాయ నియామకాల భర్తీ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ( TSTET ) నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి కఠిన ఆంక్షలతో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర నో సెల్ ఫోన్ జోన్స్ను ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగేంత వరకూ అవసరమైతే జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయించే యోచనలో అధికారులు ఉన్నారు.