Home » Journalist
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీయూడబ్ల్యూజే బృందం సోమవారం భేటీ అయ్యింది. జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నేతలు కోరారు. టీడీపీ హయాంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పెట్టిన పలు పథకాలను జగన్ రద్దు చేశారని చంద్రబాబుకు జర్నలిస్తులు వివరించారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని నేతలు తెలిపారు.
Andhrapradesh: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడికి నిరసనగా ‘‘ఛలో అనంత’’కు ఏపీయూడబ్ల్యూజే పిలుపునిచ్చింది. అయితే ఏపీయూడబ్ల్యూజే 'చలో అనంత'పై పోలీసులు నిర్బంధం విధించారు. ఈ కార్యక్రమానికి బయలుదేరిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ అణచివేసి... స్టేషన్లకు తరలించారు. అయితే పోలీసుల నిర్బంధం మధ్యే జిల్లాలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఏపీయుడబ్ల్యూజే, జర్నలిస్టులు శాంతి ర్యాలీ చేపట్టారు.
రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై (Andhra Jyothy Photographer Srikrishna) దాడి చేసిన వారి మీద కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ (SP Anburajan) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని వదలలేదని.. ఇప్పటికే వారందరినీ ఐడెంటిఫై చేసినట్లు తెలిపారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించామన్నారు. పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు.
Andhrapradesh: అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ రౌడీ మూక దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళలు చేపట్టారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఎదుట బైఠాయించి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: వైఎస్సార్సీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణను పలువురు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు పరామర్శించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ మూకల దాడిని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.
Andhrapradesh: అనంతలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు బైఠాయించి నిరసనకు దిగారు.
చంద్రబాబు తన హయాంలో ఎన్నికల ముందు మాత్రమే జనాలకు మేలు చేసే ప్రయత్నాలు చేశారంటూ జగన్ తరచూ ఆరోపిస్తుంటారు.
కేరళలోని ఎర్నాకులం(Ernakulam) జిల్లా కాలామస్సేరి(Kalamessery) నెస్ట్ సమీపంలోని యెహోవా ప్రార్థనా మందిరంలో అక్టోబర్ 29న ఉదయం 9.30కు టిఫిన్ బాక్స్ లో అమర్చిన ఐఈడీ(IED Bombs) బాంబులు ఒక్కసారిగా పేలిన ఘటన విదితమే. పేలుళ్ల ఘటన వివరాలను కవర్ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్టుపై(Journalist) ముస్లిం వ్యక్తి కేసు నమోదు చేశారు.
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Palestine) ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భీకర బాంబుల దాడుల్లో 21 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్(CPJ) వెల్లడించింది.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి మీడియాకు అనుమతి నిరాకరించారు.